Posts

పద్యాల్లో సమకాలీన సమస్యలు

మల్లవరపు జాన్ కవిగారి అబ్బాయి శ్రీ మల్లవరపు రాజేశ్వరరావు తండ్రి నుండి పద్యరచనా వారసత్వాన్ని అందిపుచ్చుకున్న చందానికి దాఖలా ‘జీవనది’ పద్య ఖండికా సంపుటి. వస్తు వైవిధ్యం, పద్య శిల్పంలో రాజేశ్వరరావుగారు ఈ రచనల్లో మంచి పారీణతతో ప్రదర్శించారు. సమకాలిక అంశాలనుకూడా పద్యాలలో ప్రతిబింబించడం కవి నేర్పుపై ఆధారపడి వుంటుందని, ఇందులోని పలు ఖండికలు నిరూపిస్తాయి. అన్వయ క్లిష్ఠత లేని ఒక ధార రచనలో కానవస్తుంది. నలభై రెండు ఖండికల ఈ పద్య సంపుటిలో ప్రేమ, దేశభక్తి, శ్రమజీవన చిత్రణ, ప్రకృతి వర్ణన, అస్పృశ్యతా నిరసనం, కవిప్రశంస, పర్వదిన వివరణ వంటి అంశాలున్నాయి. రైతును ప్రశంసిస్తూ- నీవులేని నాడు నిఖిల లోకమె లేదు హలము కదిపి పొలమునంత దున్ని పంటనిడుచు జనుల ప్రాణాల నిలబెట్టు హాలికుడవు! జగతి పాలకుడవు అంటారు. ఆధునిక వ్యవసాయం, రైతు జీవనం ఎన్ని మార్పులకు గురి అయినా ఇంకా హలము, పొలము వంటి పదాలు లేకుండా రైతు జీవన చిత్రణం సాధ్యంకాదేమో! ‘‘పొట్టకు మెతుకులు చిక్కక దిట్టత కోల్పోయి జనుల దీనతదోపన్ దిట్టుచునుండగ, నీ కం ప్యూట్టరు పథకాలు తిండి పొట్టకు నిడునా!’’ అని ఆధునికతా నిరసనం చేయడంవల్ల ప్రయోజనం కోల్పోకూడని విలువల గురించిన స్పృహ ...

ప్రారంభం

కలలు తెగిపడిన చప్పుడు వెడుతూ వెడుతూ వీడ్కోలు లేఖ గుమ్మంలో పెట్టినట్లు ఎప్పటిదో తెలీదు రెండు హృదయాల మధ్య శూన్యం స్పర్శ కూడా పట్టివ్వలేదు శూన్యప్రారంభాన్ని దుఖ్ఖంలోంచి శూన్యంలోకి ప్రవహించి ఇప్పుడు కానరాని మౌనమొక్కటే మిగిలింది మౌనం భాష కాకుంటే బాగుణ్ణు కాస్త తలదాచుకోడానికి చోటైనా దక్కేది ప్రశ్నై నిలిచేకొద్దీ లోపల్లోపలే సంకెళ్ళలో బందీగా మారిపోవడం ఆగి ఆగి జ్ఞాపకాలను మోసుకొచ్చే పూల పరిమళం అదృశ్యమైనట్లుగా కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి ఆనవాలు దొరకని సాక్ష్యం దేహంలోంచి దేహంలోకి తొంగిచూడడం అంత సులువేమీకాదు ఇప్పుడు ప్రారంభాన్ని వెతకాలి నిజమైన నమ్మకాన్ని పున:ప్రసారం చేయాలి నమ్మకాల్ని దాచి అవిశ్వాసపు ఒరలలో ఒట్టిపోయిన శూన్య గోళాల్ని గమనించాలి విశాల తీరాల ఒంటరితనంలోకి ఒక యుగళాగీతాన్ని ధ్వనింపచేయాలి --- మల్లవరపు ప్రభాకరరావు(2003)

మల్లవరపు రాజేశ్వరరావు 'జీవనది 'ఖండకావ్య సంపుటి పై సమీక్ష

పాదముద్ర

ఈ దారి వెంబడి నడుస్తూ వెతుకుతున్నా ఫ్రతి అడుగుని తాకుతున్నాను ఏదో అలికినట్లుగా అసలు అడుగు మాయమైనట్లుగా పైపై పూతలు ఆ అడుగును తుడిచేసారేమో అనిపిస్తుంది ఏదో మోసం జరిగింది ఏదో కుట్ర తాకింది దీనిలో నిర్మాణం లేదు విధ్వంసం మాత్రమే ఉంది ఏదీ మిగల్చకుండా గుర్తులను మరుగుపరిచే మర్మం ఉంది ఆవును ఈ పాదమెవరిదో తనది కాని దుఖ్ఖం నటిస్తుంది నాటకీయతేంటో తెలీని పాదముద్రలను వెలివేసి జీవితంలోని నాటకీయతను నర్తిస్తుంది అవును ఈ గీతలు కాస్సేపు రోదిస్తున్నట్లుగా, ప్రేమిస్తున్నట్లుగా ఏమీ లేని తెరమీద రంగులద్దినట్లుగా మాయ చేస్తుంది ఈ పాదాల లోగిట్లో ఏవో అస్పష్ట అంతరంగిక భాషణలు వినిపిస్తున్నాయి వాస్తవమొక్కటీ లేని అబద్ధాన్ని నిజంగా పలకడానికిపడే పాట్లన్నీ కనిపిస్తున్నాయి దూషించడానికి గల కారణాన్ని ద్వేషించడానికి కావల్సిన సరంజామాని జాగ్రత్తగా భద్రపరుస్తున్నాయి చెమటతో తడిసిన పరిమళం ఈ పాదముద్రలకు లేదు ఎన్ని వేల పాదముద్రలను తుడిచేసి ఈ కాంక్రీటు రూపాన్ని సృష్టించారో మహా రహదారిని నిర్మించడానికి చీలికదారిని వచ్చి చేరిన జనపదపు బాట నేడు అదృశ్యమైపోయింది చౌరస్తాలో తెగిపడిన చేతులు ముక్కలైన మొండాలు దారి వెదుక్కోవడానికి నానాయత్నాలు పా...

సెల్యూట్

ఈ రాత్రి కొన్ని కోట్ల స్వప్నాలను చెదిరిపోకుండా ఓ కన్ను పహరా కాస్తుంది తలుపులన్నీ బిడాయించుకుని తలపులకు బార్లాతీసే అనేకానేకమంది స్వగతాల్లోకి దూరం గా మసలుతూ చలిని కప్పుకుంటూ చెలిని తలచుకుంటూ తుపాకీని ఆలింగనం చేసుకునే హృదయమొకటి హిమాలయాలంత ఎత్తులో పహారా కాస్తుంది ఎన్నో రాత్రుల స్వప్నాలను, అనుభూతులను లోపల్లోపలికి కుక్కేసి దూరంగా వినబడే కవాతుల మధ్య బంకర్ల మాటున దాగుతూ ఒక్క క్షణంలో తుపాకీని గురి చూసే కన్నొకటి పహారా కాస్తుంది యుద్ధం సరిహద్దుల్లోనే… సరిహద్దుల్లోని సైనికుల్లోనే కాషన్ తీసుకునే ప్రతిసారీ మెరిసే దూరపు ఆశల నునుపైన మెరుపు గోదావరి వాగుల్లానో,కోనసీమ కొబ్బరాకుల్లానో పాలకొండల పిలుపులానో ఇంటి మొగదాల వేపచెట్టు పలకరింపులానో మెరుపులు… నాన్నెప్పుడొస్తాడని అడిగే చిన్నారి ప్రశ్నలు అన్నీ ఆశలే… బ్రతకడానికైనా,శత్రువుని గురిపెట్టడానికైనా అంతా ఆశే జీవితాన్ని కోల్పోతూనో,గెలుస్తూనో - జీతాన్నందుకున్న అమ్మ కళ్ళ మెరుపు కనిపించని దూరం చెట్టంత అండను తనకొక్కదానికే స్వంతం చేసుకోని గర్వపు క్షణాలు ఇవేవీ స్వగతాలుగా మార్చుకోకుండా కర్తవ్యం మాటున దాచేసి “మా తుఝే సలాం” అంటూ కదం తొక్కాల్సిందే అంతర్గత సంక్షోభాలు అలము...

పరిమళించే 'జాతీ'యత !

కవిత్వమంతా జాతీయతను పరిమళింప చేసే కొద్దిమంది పద్య కవులలో 'మధురకవి' మల్లవరపు జాన్ కవి గారు ఒకరు! ఆయన మరణానంతరం వెలువడుతున్నదీ"స్వగతము". దీనిలోని ఇతివృత్తం జన్మరీత్యా ఒక మాదిగవాని స్వగతం. ఇంకా లోతుగా చెప్పాలంటే కులం వల్ల జీవితమంతా అవమానాల పాలై తన అస్తిత్వానికై తపన పడిన ఓ దళితుని స్వగతం దీనిలో వినిపిస్తుంది. మాదిగ జీవితం చుట్టూ ఆ వర్ణన కొనసాగినా రకరకాల జీవితానుభావాలను ఎదుర్కొంటున్న ప్రతి దళితుని ఆవేదనను ఈ "స్వగతం"లో అక్షరీకరించగలిగారు. ఈ "స్వగతము"ను ఏ ప్రక్రియగా చెప్పుకొనే వీలుందనుకొంటూ చదివాను. మన లాక్షణికులు "ఖండకావ్యం, ఆఖ్యానం, ఆఖ్యాయిక వంటి వాటికి సమానమైన పోలికలున్న కొన్ని లక్షణాలను చెప్పారు. "ఖండకావ్యం భవేత్కావ్యస్యైకాదేశనుసారిచ" అని 'సాహిత్య దర్పణం' ఖండకావ్యం అంటే ఏమిటో వివరిస్తుంది. కవి తాను స్వయంగా చూసిన దాన్ని చెబితే (స్వయం దృష్టార్థ కథనం ప్రాహురాఖ్యానం బుథా) దాన్ని 'ఆఖ్యానం' అని అంటారు. 'కల్పితేతివృత్తం కలిగినదాన్ని కథ' అని 'సత్యేతివృత్తాంతం కలదాన్ని ఆఖ్యాయిక (కథ కల్పిత వృత్తాంతా సత్యార్థాఖ్యాయికా మ...

అనూభూతి స్పర్శనందించిన శతకం !

' మధురకవి' బిరుదాంకితులు మల్లవరపు జాన్ కవిగారు పద్యం రాసినా, వచనం రాసినా అలవోకగా సాగిపోతుంది. ప్రతి పద్యం ద్రాక్షాపాకంతో రసభరితంగా ఉంటుంది. వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉండే నిగూఢమైన భావాల్ని కూడా సరళంగా అర్థమయ్యే శైలీలో వర్ణించ గల ప్రతిభాశాలి జాన్ గారు. అలాంటి కవిగారి కవిత్వాన్ని సమకాలీన దిగ్గజ్జాల్లాంటి కవులు కూడా మెచ్చుకోవటం ఒక ప్రత్యేకత. అయితే, ఆయన గురించి ఒక శతకమే వెలువడటం మరో విశేషం. ప్రముఖ కవి, అవధాని చేగిరెడ్డి చంద్రశేఖర రెడ్డిగారు మల్లవరపు జాన్‌కవి జీవితం, వ్యక్తిత్వం, రచనలలో కనిపించే తత్త్వం ఇలా అన్నింటినీ రసభరితంగా వర్ణిస్తూ " మధురకవీంద్రశతకం"ను రాశారు. ఒకటి రెండు పద్యాలు మినహా "కవీంద్ర" అనేదే మకుటం. ఈ మకుటాన్ని ఎన్నుకోవటంలోనే చంద్రశేఖర రెడ్డిగారికి, జాన్‌కవిగారి పట్ల గల అభిమానం వ్యక్తమవుతుంది. జాన్‌కవిగారి కుటుంబాన్ని బాగా పరిశీలిస్తేగాని రాయలేని కొని పద్యాలు ఈ శతకంలో కనిపిస్తున్నాయి. " వ్యాసునకు వినాయకునటు వ్రాసెను మధురమున కొడుకు రాజేశ్వరరావ్ వాసిని గాంచగ కృతులన్ శ్యాసయనగ మెల్గి నాడు !జాన్ కవీంద్రా!" జాన్‌కవిగారి కుటుంబం గురించి త...